చంద్రుడిపై చైనా అద్భుతం.. మొలకెత్తిన పత్తి విత్తనం!
- January 16, 2019బీజింగ్: చంద్రుడిపై పత్తి విత్తనం మొలకెత్తింది. ఇటీవల చైనా పంపిన చేంజ్-4 ప్రోబ్లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. చేంజ్4 పంపిన చిత్రాల ఆధారంగా చైనా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి శాస్త్రవేత్తలు పలు రకాల విత్తనాలను చంద్రుడి మీదకు తీసుకువెళ్లారు. కానీ వాటిలో పత్తి విత్తనం ఒక్కటే మొలిచినట్లు చైనా శాస్త్రవేత్తలు చెప్పారు. ఈనెల 3వ తేదీన చంద్రుడి చీకటి ప్రదేశంలో చేంజ్4 ప్రోబ్ దిగింది. చంద్రుడి ఆవలి వైపుకు ఓ రోవర్ వెళ్లడం కూడా ఇదే మొదటిసారి. అయితే ఈ రోవర్పై పత్తితో పాటు ఆయిల్సీడ్ రేప్, పొటాటో, ఆరాబిడోప్సిస్ విత్తనాలను కూడా పంపించారు. సౌత్వెస్ట్ చైనాలోని చాంగ్కింగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విత్తనాలను ఆ ప్రోబ్లో పొందుపరిచారు. గతంలో అంతర్జాతీయ పరిశోధనా కేంద్రంలో మొక్కలు మొలిచాయి. కానీ చంద్రుడి మీద ఓ విత్తనం మొలకెత్తడం ఇదే ప్రథమం. ఇక నుంచి ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోనే తమ ఆహారాన్ని పండిస్తారని, తిండి కోసం వాళ్లు తిరిగి భూమికి రావాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పంటలతో చంద్రుడిపై జీవానుకూల వాతావరణాన్ని అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్న విషయం తెలిసిందే. 18 సెంటీమీటర్ల క్యాన్లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..