ఢిల్లీ హోటల్ ఆర్పిట్ ప్యాలెస్లో అగ్నిప్రమాదం..17 మంది సజీవ దహనం
- February 12, 2019దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్బాగ్ ప్రాంతంలో గల హోటల్ ఆర్పిట్ ప్యాలెస్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17 మంది సజీవదహన మయ్యారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు.
తీవ్రంగా ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తుంది. గాయపడ్డ పలువురిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు.
సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సుమారు 26 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధంచి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. భారీగా అగ్ని ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?