రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వివరాలు..
- March 09, 2019తెలంగాణ:పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో అధిక సీట్లు సాధించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. పర్యటనలోభాగంగా ఆయన నాందేడ్ నుంచి బైంసాకు రానున్నారు.
శంషాబాద్ లోని క్లాసిక్ కన్వేన్షన్ సెంటర్ పక్కనున్న గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొననున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం చేస్తున్న మొదటి సభ కాగా అసెంబ్లీ ఎన్నికల తరువాత రాహుల్ తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. ఇక రేపు శంషాబాద్ లోని ఓ హోటల్ లో పార్టీ ముఖ్యనేతలతో రాహుల్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సుమారు గంట సమయం కేటాయించినట్లుగా తెలుస్తుంది. రాహుల్ పర్యటన కాంగ్రెస్ కేడర్లో ఉత్సహం నింపుతుంది అన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు