పద్మ అవార్డు ప్రధానోత్సవ వేడుక..
- March 11, 2019పద్మ అవార్డుల ప్రధానోత్సవం ఉత్సాహంగా సాగింది. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి పద్మ అవార్డులను ప్రధానం చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. నాట్య రంగంలో అమోఘమైన ప్రతిభను కనబరిచినందుకుగానూ ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించింది.
ఇండియన్ మైఖెల్ జాక్సన్గా పేరుతెచ్చుకున్న ప్రభుదేవా తన 25 ఏళ్ల కెరీర్లో ఎన్నో విభిన్నమైన డ్యాన్సింగ్ స్టయిల్స్ను చిత్రపరిశ్రమకు పరిచయం చేశారు. ఉత్తమ కొరియోగ్రాఫర్గా రెండుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. దాదాపు 13 చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు.
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కోవింద్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. 2001లో మోహన్లాల్ను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మోహన్లాల్ దాదాపు 300 చిత్రాల్లో నటించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?