టాయిలెట్లో స్టూడెంట్పై దాడి
- March 14, 2019కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓ స్కూల్లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షనకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్న మినిస్ట్రీ, నేరస్తుల్ని కఠినంగా శిక్షిస్తామని పేర్కొంది. గవర్నమెంట్ ప్రిలిమనరీ స్కూల్ విద్యార్థిపై స్కూల్ టాయిలెట్లోనే మరికొందరు సహ విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటనను వీడియోలో చిత్రీకరించారు కూడా. మినిస్టర్ డాక్టర్ హమెద్ అల్ అజ్మి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. దాడిలో పాల్గొన్నవారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారాయన. స్కూల్ యాజమాన్యం ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సి వుందనీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైకాలజిస్టులతో కౌన్సిలింగ్లు విద్యార్థులకు ఇప్పించాలని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు