దుబాయ్లో శ్రీ గణపతి సచ్చిదానంద 'పూర్ణ చంద్ర రాగ సాగర'
- April 16, 2019దుబాయ్:దత్త యోగ సెంటర్, యూఏఈ నేతృత్వంలో పూర్ణ చంద్ర రాగసాగర పేరుతో మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ అనే ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 19న ఈ ఈవెంట్ జరుగుతుంది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ సింథసైజర్పై పెర్ఫామ్ చేయబోతున్నారు. ప్రముఖ వయోలిన్ కళాకారుడు డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం కూడా తన ప్రదర్శనను ఇవ్వబోతున్నారు. పండిట్ అనిందో చటర్జీ తబ్లా మరియు విద్వాన్ వి సురేష్ ఘటమ్ ఇతర ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. ఆధ్మాత్మిక గురువు అయిన గణపతి సచ్చిదానంద స్వామీజీ గ్రేట్ మ్యుజీషియన్ కూడా.పలు దేశాల్లో ఇప్పటికే ఆయన అనేక ప్రదర్శనలు ఇచ్చి వున్నారు. ఆయన సంగీతం వినేవారికి సరికొత్త అనుభూతిని మిగుల్చుతుంది. 300కి పైగా మ్యూజిక్ కాన్సెర్ట్స్లో స్వామీజీ పాల్గొన్నారు. ఐ ట్యూన్స్, ప్లే స్టోర్లో 250కి పైగా మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా ఆయనవి అందుబాటులో వున్నాయి. దుబాయ్ ఒపెరాలో స్వామీజీ మ్యూజిక్ కాన్సెర్ట్ కోసం ఏర్పాట్లు ఇప్పటికే జోరందుకున్నాయి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు