శివకార్తికేయన్ ఓటేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం
- April 24, 2019ఓటరు జాబితాలో పేరు లేకున్నా.. తమిళ నటుడు శివకార్తికేయన్ ఓటేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తమిళనాడులో ఈనెల 18న రెండో దశ పోలింగ్ జరిగింది. ఓటు వేసేందుకు నటుడు శివకార్తికేయన్ దంపతులు వలసరవక్కంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఓటరు జాబితాలో కార్తికేయన్ భార్య ఆర్తి పేరు ఉంది.. కార్తి కేయన్ పేరు మాత్రం గల్లంతైంది. అయినా ఓటేశారు.
అయితే దీనిపై విలేకరులు ప్రశ్నించగా.. ‘ప్రత్యేక అనుమతి తీసుకుని ఓటు వేశానని చెప్పి వెళ్లిపోయారు శివకార్తికేయన్ . అనంతరం, వేలికి సిరా ఉన్న ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశారు . ఇది కాస్త సామాజిక మాద్యమాల్లో వైరల్ అయింది. ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా ఎలా ఓటు వేశారంటూ ఎన్నికల సంఘం సీరియస్ అయింది. తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి సత్యబ్రత సాహూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అక్కడి పోలింగ్ కేంద్రం అధికారుల తప్పిదమే అంటూ.. వారిపై చర్యలకు ఆదేశింశారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు