'సాహో' సెట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
- April 27, 2019ముంబయి: ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ 'సాహో'. శ్రద్ధాకపూర్ కథానాయిక. ప్రస్తుతం ముంబయిలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 'సాహో' బృందాన్ని కలిశారు. ప్రభాస్, శ్రద్ధాకపూర్, సుజీత్లతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న 'సాహో'ను ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన రెండు టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ నిర్మిస్తున్నారు. శంకర్-ఎషెహన్-లాయ్లు సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంగా విడుదల కానుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ