'కామినేని' ఆస్పత్రిలో మూడు రోజులు ఉచిత వైద్యసేవలు
- April 27, 2019హైదరాబాద్:కింగ్కోఠిలోని కామినేని ఆస్పత్రిలో మూడు రోజుల పాటు ఓపీ సేవల్లో ఎలాంటి రుసుము లేకుండా వైద్యసేవలు అందిస్తున్నామని కామినేని ఆస్పత్రి డైరెక్టర్, సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ వసుంధర కామినేని తెలిపారు. ఆస్పత్రిలో సాయంత్రం వేళల్లో సేవలకు శుక్రవారం ఆమె శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కామినేని ఆస్పత్రి పరిసరాల్లో ఉన్న వారికి సాయంత్రం వేళల్లో వైద్యసేవలు అందక ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని స్థానికులు, రోగులు తమ దృష్టికి తీసుకు రాగా.. ఈ మేరకు సేవలను ప్రారంభించామన్నారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు సాయంత్రం 6 గంటల నుంచి 8 వరకు ఈ వైద్యసేవలను రోగులకు అందిస్తామన్నారు. ఇందులో కార్డియాలజీ, న్యూరాలజీ, యురాలజీ, జనరల్ మెడిసిన్స్, జనరల్ సర్జరీ, పిల్లల విభాగాలకు సంబంధించిన వైద్య సేవలందిస్తామని ఆమె వివరించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు