'కామినేని' ఆస్పత్రిలో మూడు రోజులు ఉచిత వైద్యసేవలు
- April 27, 2019
హైదరాబాద్:కింగ్కోఠిలోని కామినేని ఆస్పత్రిలో మూడు రోజుల పాటు ఓపీ సేవల్లో ఎలాంటి రుసుము లేకుండా వైద్యసేవలు అందిస్తున్నామని కామినేని ఆస్పత్రి డైరెక్టర్, సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ వసుంధర కామినేని తెలిపారు. ఆస్పత్రిలో సాయంత్రం వేళల్లో సేవలకు శుక్రవారం ఆమె శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కామినేని ఆస్పత్రి పరిసరాల్లో ఉన్న వారికి సాయంత్రం వేళల్లో వైద్యసేవలు అందక ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని స్థానికులు, రోగులు తమ దృష్టికి తీసుకు రాగా.. ఈ మేరకు సేవలను ప్రారంభించామన్నారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు సాయంత్రం 6 గంటల నుంచి 8 వరకు ఈ వైద్యసేవలను రోగులకు అందిస్తామన్నారు. ఇందులో కార్డియాలజీ, న్యూరాలజీ, యురాలజీ, జనరల్ మెడిసిన్స్, జనరల్ సర్జరీ, పిల్లల విభాగాలకు సంబంధించిన వైద్య సేవలందిస్తామని ఆమె వివరించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







