ఎయిర్‌ ఇండియా విమాన సేవలకు అంతరాయం

- April 27, 2019 , by Maagulf
ఎయిర్‌ ఇండియా విమాన సేవలకు అంతరాయం

ఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా సేవలకు అంతరాయం ఏర్పడింది. సర్వర్‌ డౌన్‌ కారణంగా శనివారం ఉదయం నుంచి సర్వీసులు స్తంభించిపోయాయి. దీంతో వివిధ విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. అలాగే అనేక విమానాలు నిర్దేశిత సమయం కంటే ఆలస్యంగా బయలుదేరనున్నాయి. దీంతో దిల్లీ, ముంబయి విమానాశ్రయాలు ప్రయాణికులతో రద్దీగా మారినట్లు సమాచారం. దీనిపై ప్రయాణికులు సామాజిక మాధ్యమాల వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై ఎయిర్‌ ఇండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ''ఎస్‌ఐటీఏ సర్వర్‌ డౌన్‌ అయింది. ఇప్పటికే సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించే ప్రయత్నాల్లో ఉన్నారు. త్వరలోనే సేవలు ప్రారంభమవుతాయి. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము'' అని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com