ఎయిర్ ఇండియా విమాన సేవలకు అంతరాయం
- April 27, 2019
ఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సేవలకు అంతరాయం ఏర్పడింది. సర్వర్ డౌన్ కారణంగా శనివారం ఉదయం నుంచి సర్వీసులు స్తంభించిపోయాయి. దీంతో వివిధ విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. అలాగే అనేక విమానాలు నిర్దేశిత సమయం కంటే ఆలస్యంగా బయలుదేరనున్నాయి. దీంతో దిల్లీ, ముంబయి విమానాశ్రయాలు ప్రయాణికులతో రద్దీగా మారినట్లు సమాచారం. దీనిపై ప్రయాణికులు సామాజిక మాధ్యమాల వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ''ఎస్ఐటీఏ సర్వర్ డౌన్ అయింది. ఇప్పటికే సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించే ప్రయత్నాల్లో ఉన్నారు. త్వరలోనే సేవలు ప్రారంభమవుతాయి. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము'' అని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!







