యూ.ఏ.ఈ విష్ణుసహస్రనామం గ్రూప్ ఆధ్వర్యం లో సాముహిక సత్యనారాయణ వ్రతం
- April 30, 2019యూ.ఏ.ఈ లో గల విష్ణుసహస్రనామం గ్రూప్ ఆధ్వర్యం లో గత గురువారం (ఏప్రిల్ 24) నుండి శనివారం(ఏప్రిల్ 26) వరకు సాముహిక సత్యనారాయణ వ్రతం మరియు విష్ణుసహస్రనామ అఖండ పారాయణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భక్తులు 44 గంటల పాటు ఏకధాటిగా 144మార్లు విష్ణుసహస్రనామ స్తోత్ర పఠనం చేసారు. గురువారం ఉదయం సుప్రభాత సేవ తో మొదలైన ఈ కార్యక్రమం, అనంతరం స్వమివారి అభిషేకం, మహానివేదన అనంతరం సామూహిక సత్యనారాయణ వ్రతం, మహాప్రసాదం తదితర కార్యక్రమాలతో కొనసాగింది. శుక్రవారం తిరిగి సుప్రభాత సేవ తో మొదలై కొనసాగిన అఖండ విష్ణుసహస్రనామ పారాయణ శనివారం సాయంత్రం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్య లో హాజరైన భక్తులు స్వామివారి అమూల్యమైన కృపకు పాత్రులయ్యారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ