అక్షయ్ కుమార్.. రియల్ హీరో
- May 07, 2019పెను తుపాను బాధితులు ధైర్యంగా ఉండాలని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్ ట్వీట్ చేశాడు. ఫొని దెబ్బకు విలవిల్లాడిన ఒడిశాకు ఆపన్నహస్తం అందించాడు అక్షయ్. ప్రకృతి విధ్వంసంలో దారుణంగా దెబ్బతిన్న రాష్ట్రానికి కోటి తుపాను సాయం ప్రకటిస్తూ, మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాడు. ప్రకృతి విపత్తులు సంభవించినపుడు ఆయా ప్రాంతాలకు తనవంతు సాయం అందించటం అక్షయ్కు కొత్త కాదు. కేరళ, చెన్నై ప్రాంతాల్లోనూ ఇటీవల తుపాన్లు భీభత్సం సృష్టించినపుడు -అక్షయ్ తనవంతు సాయాన్ని ప్రకటించాడు. '్భరత్ కే వీర్' వెబ్సైట్ ద్వారా జవానుల కుటుంబాలను ఆదుకోవడం నాకు సంతృప్తినిచ్చే విషయమని పదేపదే చెప్పే అక్షయ్కుమార్, ఇటీవలి కాలంలో దేశభక్తి చిత్రాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడమూ తెలిసిందే. పెను తుపానుగా విరుచుకుపడిన ఫొని, ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం తెలిసిందే.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ