ఇఫ్తార్ హోస్టింగ్ ఎంతో సంతృప్తికరం: క్రిస్టియన్ వలసదారుడు
- May 11, 2019ఫుజైరా కి చెందిన భారత వలసదారుడు సాజి చెరియన్, యూఏఈలో ఓ మసీదు నిర్మించడమే కాక, ఇఫ్తార్ విందును కూడా ఏర్పాటు చేస్తున్నారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు సేవ చేసుకునే భాగ్యం తనకు కలిగిందని క్రిస్టియన్ అయిన సాజి చెరియన్ చెప్పారు. బ్లూ కాలర్ వర్కర్స్ కోసమే అన్ని అనుమతులూ తీసుకుని మసీదు నిర్మించినట్లు చెప్పారాయన. ఫుజైరా చేరుకోవాలంటే 20 నుంచి 30 దిర్హామ్లు ట్యాక్సీ ఫేర్ చెల్లించాల్సి వుంటుందనీ, అలా డబ్బు వెచ్చించలేని వారి కోసమే మసీదు నిర్మించానని అన్నారు చెరియన్. ఎయిర్ కండిషన్డ్ కన్వెన్షన్ సెంటర్ని నిర్మించి, అక్కడే వందలాది మంది కార్మికులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారు. 2004లో చెరియన్ దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి ఆయన విజయ ప్రస్థానం ప్రారంభమయ్యింది. ఇప్పుడాయన ఓ వ్యాపార వేత్తగా ఎదిగారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు