కాబూల్:24 మంది తాలిబన్ ఉగ్రవాదుల హతం..
- May 12, 2019కాబూల్: అఫ్గానిస్థాన్ భద్రతా బలగాలు తమ దేశంలోని హేరాత్, పక్తీకా, గజనీ ప్రావిన్సుల్లో జరిపిన వైమానిక దాడుల్లో 24 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. అఫ్గాన్ మిలిటరీ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... 20 మంది తాలిబన్లను పక్తీకా ప్రావిన్సులోని జుర్మాత్, బెర్మాల్ జిల్లాల్లో హతమార్చారు. గజనీ ప్రావిన్సులోని అందర్ జిల్లాలో ఇద్దరు, హేరాత్ ప్రావిన్సులోని ఫర్సీ జిల్లాలో మరో ఇద్దరిని భద్రతా బలగాలు హతమార్చాయి. అఫ్గాన్ వ్యాప్తంగా తాలిబన్లు ఉగ్రవాద చర్యలను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలపై తాలిబన్లు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
తాలిబన్లు, ఐఎస్ ఉగ్రవాదుల చర్యల కారణంగా అఫ్గానిస్థాన్.. రాజకీయ అస్థిరత, సామాజిక, భద్రత సమస్యలను ఎదుర్కొంటోంది. దేశంలోని ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో ఇతర దేశాల భద్రతా బలగాల సాయంతో ఆఫ్గాన్ బలగాలు ఉగ్ర వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నాయి. హేరాత్, పక్తీకా, గజనీ ప్రావిన్సులతో పాటు హెల్మాంద్, ఉరుజ్గాన్, జాబూల్, నంగర్హర్ ప్రావిన్సుల్లోనూ భద్రతా బలగాలు ఉగ్రవాదుల శిబిరాలపై వైమానిక దాడులు జరుపుతున్నాయి.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..