సంచలనం.. పుల్వామా ఉగ్రదాడి వెనుక మన జవాన్..
- May 18, 2019పాకిస్థాన్కు చెందిన యువతి పన్నిన వలలో చిక్కిన ఒక భారత జవాను, సైనిక రహస్యాలను ఆమెకు, తద్వారా పాక్ ఉగ్రవాదులకు అందించాడు. ఆ సమాచారంతోనే ఉగ్రవాదులు పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి, 40 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నారు.మధ్యప్రదేశ్ ఉగ్రవాద వ్యతిరేకదళం, కేంద్ర నిఘా సంస్థలు చేసిన దర్యాప్తులో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
ఇండోర్ సమీపంలోని మోహో పట్టణంలో బీహర్ రెజిమెంటలో నాయక్ క్లర్కుగా అవినాశ్ కుమార్ అనే యువకుడు పని చేసేవాడు. 2018లో అతడిని అసోంకు బదిలీ చేశారు. ఆ సమయంలో అతడికి వాట్సాప్ లో ఓ పాకిస్థాన్ యువతితో పరిచయం ఏర్పడింది. తన అందచందాలతో అవినాశ్ను వలలో వేసుకున్న ఆ యువతి.. సైనిక రహస్యాలను అతడి వద్ద కూపీ లాగి ఉగ్రవాదులకు చేరవేసేది.
అవినాశ్ ఇచ్చిన సమాచారంతో పక్కా ప్రణాళిక రచించుకున్న ముష్కరులు.. పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అవినాశ్ బ్యాంక్ ఖాతాలో పాకిస్థాన్ నుంచి 50వేల రూపాయల నగదు కూడా జమ అయ్యిందని దర్యాప్తులో తేలింది. భోపాల్లోని ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్కు తరలించారు. అవినాశ్ తండ్రి కూడా జవానే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..