ఏజెంట్ చేతిలో మోసపోయిన 35 మంది భారతీయ వలసదారులు
- May 27, 2019భారతదేశంలోని కర్నాటకకు చెందిన 35 మంది భారతీయ కార్మికులు ఎంప్లాయ్మెంట్ ఫ్రాండ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ ప్లేస్మెంట్ ఏజెన్సీ ద్వారా కువైట్కి తాము వెళ్ళినట్లు బాధితులు పేర్కొంటున్నారు. ఒక్కొక్కరి దగ్గరనుంచి సదరు సంస్థ 65,000 రూపాయలు వసూలు చేసిందని చెప్పారు బాధితులు. కువైట్ చేరుకున్న తర్వాతగానీ బాధితులకు తాము మోసపోయిన విషయం తెలియలేదు. ఆరు నెలలుగా కువైట్లో సమస్యలు ఎదుర్కొంటున్నామనీ, తకు జీతాలు సరిగ్గా రాలేదని బాధితులు పేర్కొంటున్న వీడియో ఒకటి వెలుగు చూసింది. కంపెనీ తమను మోసం చేసిందనీ, కువైట్ జైళ్ళలో మగ్గేలా చేస్తామని బెదిరిస్తోందనీ వాపోయారు. విధి నిర్వహణలో నలుగురు కార్మికులు గాయపడినా, వారిని కంపెనీ ఆదుకోలేదని ఓ బాధితుడు చెప్పారు. బాధితుల వెతలకు సంబంధించిన వీడియో చూసిన మంగళూరు సౌత్ ఎమ్మెల్యే వేద వ్యాస్ కామత్, వారికి సాయం చేసేందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. బాధితులంతా మంగళూరుకి చెందినవారే.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!