ఘనంగా హిప్పీ ప్రీ రిలీజ్ వేడుక
- June 02, 2019ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కార్తికేయ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం హిప్పీ. ఈ చిత్రంలో దిగాంగనా సూర్యవంశీ నాయికగా నటిస్తోంది. జేడీ చక్రవర్తి మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. టీఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న హిప్పీ చిత్రాన్ని వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. ఈ నెల 6న హిప్పీ భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో కార్తికేయ మాట్లాడుతూ.ఆర్ఎక్స్ 100 సినిమా నాకు నటుడిగా కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఈ సినిమా విజయంతో నాపై అంచనాలు పెరిగాయి. ప్రేక్షకుల అభిమానం పెంచుకు న్నారు. మీ ప్రేమను కాపాడుకోవాలంటే నేను కష్టపడాలి. అందుకే హిప్పీలాంటి సినిమా చేస్తున్నాను. దర్శకుడు నాలో ఏం చూశారో గానీ నాతో ఫైట్స్, డాన్సులు చేయించారు.
ఓ మంచి సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆర్ ఎక్స్ 100 చిత్రంలో ఒక అమ్మాయి వదిలేసిందని ఏడ్చిన నేను.ఈ చిత్రంలో ఇద్దరు అమ్మాయిలతో తిరుగుతూ సందేశాలు చెబుతుం టాను. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశంలో మీరు, మీ స్నేహితులూ కనిపిస్తారు. రజినీకాంత్గారితో సినిమా చేసిన నిర్మాత నాకు అవకాశం ఇవ్వడం ఆశ్చర్య మేసింది.
హిప్పీ ఖచ్చితంగా ఘన విజయం సాధి స్తుంది. ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తారు. అని చెప్పారు. దర్శకుడు టీఎన్ కృష్ణ మాట్లడుతూ.
కార్తికేయ కళ్లు నాకు చాలా ఇష్టం. అవి చూసే హిప్పీలో అవకాశం ఇచ్చాను. కార్తికేయ పెద్ద హీరో అవుతాడు. కార్తీ అనే పాత్రలో అతను నటించాడు.
ఈ పాత్ర సందర్భానుసారంగా సాగుతుంది. నిర్మాత థాను గారి అండతోనే సినిమా పూర్తి చేయగలిగాం. అన్నారు. జేడీ చక్రవర్తి మాట్లాడుతూ..నిర్మాత థాను గారు మంచి కవి, సంగీత అభిరుచి గల వ్యక్తి, మంచి సినిమా చేయగల సత్తా ఉన్న నిర్మాత.
ఆయనకు సినిమా మీద ప్రేముంది. చిత్ర పరిశ్రమలో థాను గారికి మంచి అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే హిప్పీ అనే ఆకట్టుకునే సినిమాను నిర్మించారు. కార్తికేయకు కెమెరా వెనుక నటించడం రాదు. మంచి వ్యక్తి. అన్నారు. ఈ కార్యక్రమంలో పాటల రచయిత అనంత శ్రీరామ్, నటి హరితేజ, దర్శకుడు అజయ్ భూపతి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్