హీరో నితిన్ కొత్త చిత్రం ప్రారంభం...

- June 23, 2019 , by Maagulf
హీరో నితిన్ కొత్త చిత్రం ప్రారంభం...

శ్రీనివాస కళ్యాణం చిత్రం తర్వాత చాల గ్యాప్ తీసుకున్న నితిన్..తాజాగా భీష్మ చిత్రాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. వెంకీ కుడుములు డైరెక్షన్లో రష్మిక హీరోయిన్ ఈ మూవీ రూపుదిద్దుకోబోతుంది. ఈ చిత్రం సెట్స్ పైకి ఇంకా వెళ్లకముందే మరో సినిమాకు కొబ్బరి కాయ కొట్టారు.

చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో తన 28 వ చిత్రాన్ని నితిన్ మొదలు పెట్టాడు. హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఇందులో మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయికలుగా నటించనున్నారు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా నితిన్ ట్విట్టర్ లో చిత్ర విశేషాలను పంచుకున్నారు. 'నా 28వ సినిమాకి ముహూర్తం ఖరారైంది. చంద్రశేఖర్‌ యేలేటితో కలిసి పనిచేయబోతున్నందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. మొత్తానికి రకుల్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌లతో కలిసి పనిచేయబోతున్నాను. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు' అని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com