నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- April 25, 2024అమరావతి: వైసీపీ అధినేత, సీఎం జగన్ పులివెందుల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు పులివెందుల సీఎస్ఐ గ్రౌండ్లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్ స్టోరీ. ఈ అభివృద్ధికి కారణం మహానేత వైయస్ఆర్, ఆయన బిడ్డగా వైయస్ఆర్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మీ బిడ్డ జగన్ ప్రభుత్వం. పులివెందులలో ఏం ఉంది? అనే స్థాయి నుంచి పులివెందులలో ఏం లేదు? అనే స్థాయికి చేరుకున్నాం. అందుకే పులివెందుల ఒక విజయగాథ. మంచి చేయడం మన కల్చర్.. మంచి మనసు మన కల్చర్.. మాట తప్పకపోవడం మన కల్చర్.. బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్’’ అంటూ జగన్ భారీ డైలాగ్స్ తో కార్యకర్తల్లో జోష్ నింపారు. అలాగే టీడిపి , బిజెపి , జనసేన , కాంగ్రెస్ పార్టీల అధినేతల ఫై విమర్శలు కురిపించారు. ఇక ఎంపీ అవినాష్ రెడ్డి చాల అమాయకుడు , పిల్లవాడు..ఆయన రాజకీయ జీవితం నాశనం చేయాలనీ చెల్లెమ్మలు కుట్ర చేస్తున్నారంటూ పరోక్షంగా షర్మిల , సునీతల ఫై జగన్ ఆరోపణలు చేసాడు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్