హీరో నితిన్ కొత్త చిత్రం ప్రారంభం...
- June 23, 2019శ్రీనివాస కళ్యాణం చిత్రం తర్వాత చాల గ్యాప్ తీసుకున్న నితిన్..తాజాగా భీష్మ చిత్రాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. వెంకీ కుడుములు డైరెక్షన్లో రష్మిక హీరోయిన్ ఈ మూవీ రూపుదిద్దుకోబోతుంది. ఈ చిత్రం సెట్స్ పైకి ఇంకా వెళ్లకముందే మరో సినిమాకు కొబ్బరి కాయ కొట్టారు.
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తన 28 వ చిత్రాన్ని నితిన్ మొదలు పెట్టాడు. హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఇందులో మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటించనున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా నితిన్ ట్విట్టర్ లో చిత్ర విశేషాలను పంచుకున్నారు. 'నా 28వ సినిమాకి ముహూర్తం ఖరారైంది. చంద్రశేఖర్ యేలేటితో కలిసి పనిచేయబోతున్నందుకు ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. మొత్తానికి రకుల్, ప్రియా ప్రకాశ్ వారియర్లతో కలిసి పనిచేయబోతున్నాను. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు' అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..