దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విద్యుత్ సమస్య
- July 16, 2019దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్కి చెందిన మూడో టెర్మినల్లో 30 నిమిషాల పాటు విద్యుత్ సమస్య తలెత్తింది. అయితే, ఈ సమస్య కారణంగా ఎయిర్పోర్ట్ ఆపరేషన్కి ఎలాంటి సమస్యలూ రాలేదు. ఉదయం 11.04 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ అధికార ప్రతినిథి వెల్లడించారు. 30 నిమిషాల్లోనే సమస్యను సరిదిద్దామని చెప్పారు. అయితే, ఏసీ యూనిట్స్ షట్ డౌన్ అవడంతో పలువురు ప్రయాణీకులు తీవ్ర సమస్యల్ని ఎదుర్కొన్నారు. 1960లో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. సుమారు 88.2 మిలియన్ ప్రయాణీకులు ఏడాదిలో ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణిస్తుంటారు. 100 ఎయిర్ లైన్స్ ప్రపంచ వ్యాప్తంగా 240 డెస్టినేషన్స్కి తమ సేవల్ని అందిస్తున్నాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ