హజ్ కోసం ఒమన్ నుంచి 14,000 మంది యాత్రికులు
- July 17, 2019మస్కట్: ఈ ఏడాది మొత్తం 14,000 మంది యాత్రికులు ఒమన్ నుంచి మక్కా పర్యటనకు వెళ్ళనున్నారు. హజ్ రిట్యువల్స్ కోసం వీరంతా మక్కాకి వెళ్ళనున్నారు. వీరిలో 13,500 మంది ఒమనీయులు కాగా, 250 మంది అరబ్స్, 250 మంది నాన్ అరబ్స్ వున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎండోవ్మెంట్స్ అండ్ రెలిజియస్ ఎఫైర్స్ ఈ విషయాన్ని పేర్కొంది. 26,000 హజ్ అప్లికేషన్స్ ఈ ఏడాది వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఒమన్ అఫీషియల్ హజ్ డెలిగేషన్, జులై 28న పయనమవనుంది. రెలిజియస్ గైడెన్స్ రిప్రెజెంటేటివ్స్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ డెలిగేషన్, సూపర్ విజన్ ఆఫ్ హజ్ కంపెనీస్, మెడికల్ డెలిగేషన్ మరియు మీడియా ఇందులో వుండటం జరుగుతుంది. ఒమన్ హజ్ మిషన్ హెడ్ షేక్ సుల్తాన్ బిన్ సయీద్ అల్ హినాయ్ మాట్లాడుతూ, మినిస్ట్రీ 85 కంపెనీలను యాత్రికుల ట్రాన్స్పోర్టేషన్కి అనుమతిచ్చినట్లు తెలిపారు. హజ్ యాత్రీకుల్లో అత్యధికులు 18 నుంచి 60 ఏళ్ళ వయసు మధ్యనున్నవారే. వీరి శాతం 88.2గా వుంది. 65 శాతం మంది ఫిలిగ్రిమ్స్ ఆకాశ మార్గంలో వెళుతుండగా, 35 శాతం మంది రోడ్డు మార్గంలో వెళతారు.
తాజా వార్తలు
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్