సైన్యం లో సేవలందించేందుకు రెండు నెలలు విరామం తీసుకోనున్న ధోని
- July 21, 2019వెస్టిండీస్తో భారత క్రికెట్ జట్టు ఆడే సిరీస్ నుంచి విరామం తీసుకుని, రెండు నెలలపాటు భారత సైన్యంలో సేవలందించాలని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పారామిలటరీ రెజిమెంట్లో పని చేయాలని నిర్ణయించుకున్న ధోని ఆట నుంచి విరామం తీసుకున్నాడు. ఎనిమిదేళ్ల నుంచి అతడు పారాచూట్ సైనిక విభాగంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నాడు.
రెండు నెలలు సైనికుడిగా దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు రెండు రోజుల క్రితమే బీసీసీఐ ఉన్నతాధికారిని ధోని వ్యక్తిగతంగా కలిసి సమాచారం ఇచ్చాడని తెలిసింది. వెస్టిండీస్ సిరీస్ కోసం తన పేరును పరిగణనలోకి తీసుకోకూడదని అతడు కోరినట్లు సమాచారం.
తాజాగా అదే విషయాన్ని బీసీసీఐ ప్రతినిధి.. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లాడు.
''వరల్డ్కప్ ఆరంభానికి ముందే ధోని ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇది కేవలం రెండు నెలల విరామం మాత్రమే. రిటైర్మెంట్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అతడి నిర్ణయాన్ని కెప్టెన్ కోహ్లి, సెలక్టర్లకు తెలియజేశాం'' అని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. సైనిక విభాగంలో పనిచేయాలనే ధోని తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..