'మన్మథుడు 2' ప్రీ రిలీజ్ వేడుక
- August 04, 2019హైదరాబాద్: 'మన్మథుడు 2' సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో నిర్వహించిన ఈ వేడుకకు నటీనటులు నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, సీనియర్ నటి లక్ష్మి, అమల, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్ తదితరులు హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ దర్శకత్వం వహించారు.ఆగస్టు నెల అంటే తనకు చాలా ఇష్టమని, ఇటీవలే 'బిగ్ బాస్' ప్రారంభమైందని, మన్మథుడు2 చిత్రం రిలీజ్ కాబోతోందని అన్నారు. ఇంకా ప్రేమకథా చిత్రంలో నటించడమేంటని చాలా మంది తనను అడిగారని, ఏ వయసులో నైనా ప్రేమించ వచ్చని చెప్పే ఫ్రెంచ్ కథ ఇది అని అన్నారు. ఈ చిత్రంలో తన సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి నాగార్జున మాట్లాడుతూ, ఆమె గొప్ప నటి, ఆరోగ్యం గురించి ఆమె నుంచి చాలా నేర్చుకోవచ్చని చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు