పసిడి ధర పెరిగే అవకాశం!
- August 07, 2019అంతర్జాతీయంగా అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధంతో పసిడి ధరలు ఒక్కసారిగా ఎగిసాయి. వాణిజ్య యుద్ధం నేపథ్యంలో మదుపరులు తమ సంపదను బంగారంపై పెట్టుబడి పెట్టడమే సురక్షితంగా భావిస్తున్నారు. దీంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి.అయితే భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందా అంటే మాత్రం, సమీప భవిష్యత్తులో మాత్రం అవకాశం లేదనే చెప్పాలి. ఎందుకంటే, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులకే ఇందుకు కారణం, భవిష్యత్తులో బ్రెగ్జిట్ అంశం మార్కెట్లను కలవరపరచడం, దేశీయంగా డిమాండ్ పెరగడం, మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో బంగారం అంతకంతకు ధర పెరుగుతుందే తప్ప దిగే సూచనలు కనిపించడం లేదు. అలాగే రూపాయి మరింత బలపడే అవకాశాలు సైతం తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో బంగారం ధరలు పెరగవచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరో ఆరు నెలల్లో బంగారం ఊహకు అందనంత రేంజిలో పెరిగిన ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అయితే దీర్ఘకాలంలో అంతర్జాతీయ పరిస్థితులను కచ్చితంగా అంచనా వేయలేని నేపథ్యంలో బంగారం పెట్టుబడులపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ధరలో హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు తప్పకుండా ఫిజికల్ బంగారం కొనుగోలు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..