ట్రాఫిక్ జరీమానా డిస్కౌంట్పై దుబాయ్ పోలీస్ ప్రకటన
- August 07, 2019
దుబాయ్:వాహనదారులు తమ వాహనాల్ని జాగ్రత్తగా నడపడం ద్వారా, చిన్న చిన్న ఉల్లంఘనలకు సంబంధించిన జరీమానాల నుంచి ఉపశమనం పొందవచ్చునని దుబాయ్ పోలీసులు ప్రకటించారు. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించేవారి క్రమశిక్షణ వృధా పోదనీ, అలాంటి వారికి చిన్న చిన్న ఉల్లంఘనల నుంచి ఉపశమనం కల్పిస్తామని పేర్కొన్నారు. మోటరిస్టులు ట్రాఫిక్ చట్టాల్ని పద్ధతిగా అనుసరించడం కోసం తాము ఈ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మూడు నెలలపాటు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడని పక్షంలో, అంతకు ముందు జరీమానాల్లో 25 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఆరు నెలలపాటు ఉల్లంఘనలకు పాల్పడకపోతే, అంతకు ముందు ఉల్లంఘనల నుంచి 50 శాతం డిస్కౌంట్ దొరుకుతుంది. అదే 12 నెలలపాటు వాహనాల్ని జాగ్రత్తగా నడిపితే, ముందున్న జరీమానాల నుంచి 100 శాతం ఉపశమనం పొందడానికి వీలుంది. 9 నెలలకు 75 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







