ట్రాఫిక్ జరీమానా డిస్కౌంట్పై దుబాయ్ పోలీస్ ప్రకటన
- August 07, 2019దుబాయ్:వాహనదారులు తమ వాహనాల్ని జాగ్రత్తగా నడపడం ద్వారా, చిన్న చిన్న ఉల్లంఘనలకు సంబంధించిన జరీమానాల నుంచి ఉపశమనం పొందవచ్చునని దుబాయ్ పోలీసులు ప్రకటించారు. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించేవారి క్రమశిక్షణ వృధా పోదనీ, అలాంటి వారికి చిన్న చిన్న ఉల్లంఘనల నుంచి ఉపశమనం కల్పిస్తామని పేర్కొన్నారు. మోటరిస్టులు ట్రాఫిక్ చట్టాల్ని పద్ధతిగా అనుసరించడం కోసం తాము ఈ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మూడు నెలలపాటు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడని పక్షంలో, అంతకు ముందు జరీమానాల్లో 25 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఆరు నెలలపాటు ఉల్లంఘనలకు పాల్పడకపోతే, అంతకు ముందు ఉల్లంఘనల నుంచి 50 శాతం డిస్కౌంట్ దొరుకుతుంది. అదే 12 నెలలపాటు వాహనాల్ని జాగ్రత్తగా నడిపితే, ముందున్న జరీమానాల నుంచి 100 శాతం ఉపశమనం పొందడానికి వీలుంది. 9 నెలలకు 75 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?