ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన టీవీ5 స్టాఫ్ రిపోర్టర్
- August 12, 2019రాజమండ్రి టీవీ5 స్టాఫ్ రిపోర్టర్ తాతాజీ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. గత వారంరోజులుగా గోదావరి పరివాహక ప్రాంతంలోని దేవీపట్నం, కోనసీమ లంక గ్రామాల వరద బాధితుల కష్టాలపై.. ప్రమాదకర పరిస్థితుల్లోనూ నిర్భయంగా రిపోర్టింగ్ చేశాడు. వరద పరిస్థితులపై వాస్తవ చిత్రాన్ని బాహ్య ప్రపంచానికి తెలియచేశాడు. ఐతే.. నిన్న తాతాజీని దురదృష్టం వెంటాడింది. తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయడపడ్డ తాతాజీ ఈ ఉదయం మృతి చెందాడు.
టీవీ 5 రిపోర్టర్ తాతాజీ ద్విచక్రవాహనంపై నిడదవోలు వెళుతుండగా తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తాడేపల్లిగూడెంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్రగాయాలు కావడంతో అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు గుర్తించారు. తాతాజీని కాపాడేందుకు టీవీ5 యాజమాన్యం శతవిధాలా ప్రయత్నించింది. అయినా పరిస్థితి విషమించింది. శరీరం వైద్యానికి స్పందించలేదు. దీంతో ఉదయం మృతి చెందాడు. తాతాజీ మృతి పట్ల టీవీ5 యాజమాన్యం సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు