వరద బాధితులకు భారీ సాయం అందించిన బాలీవుడ్ జంట
- August 13, 2019ముంబై:అందమైన రూపం వుంటే సరిపోదు.. స్పందించే మనసు కూడా ఉండాలని నిరూపించింది నటి జెనీలియా. భర్త రితేష్తో కలిసి వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందించారు. మహారాష్ట్రను ముంచెత్తిన వరదల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటిని చూసి చెలించిన జెనీలియా దంపతులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల విరాళం అందజేశారు. వరదల కారణంగా గత కొన్ని రోజులుగా మహారాష్ట్రతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడం మనసును కలచి వేసింది. అందుకే మా వంతుగా వారికి కొంత సాయం చేయాలనుకున్నాము. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిని కలిసి ‘దేశ్ ఫౌండేషన్’ తరపున విరాళం అందించామని రితేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన అన్నారు. చేయి చేయి కలిస్తే ఎంతైనా సాధించవచ్చని రితేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్విట్టర్ వేదికగా జెనీలియా, రితేష్ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..