ఇండియాకి ఆఫర్ టిక్కెట్స్ ప్రకటించిన యూఏఈ ఎయిర్లైన్స్
- August 24, 2019ఈద్ అల్ అదా సెలవుల్లో సొంత ప్రాంతాలకు వెళ్ళలేకపోయినవారికి మరో అవకాశం కల్పిస్తోంది యూఏఈకి చెందిన ఎయిర్ లైన్స్. షార్జా కేంద్రంగా పనిచేస్తోన్న ఎయిర్ అరేబియా, వన్ వే డిస్కౌంట్ ఫేర్స్ని మొత్తం 16 సిటీస్కి వెళ్ళాలనుకునేవారి కోసం ప్రకటించింది. వీటిల్లో ఇండియా, పాకిస్తాన్కి చెందిన పలు నగరాలున్నాయి. నేటితో ప్రారంభమయ్యే ఈ ఆఫర్స్ డిసెంబర్ 9 వరకు కొనసాగుతాయి. ముంబైకి వెళ్ళాలనుకునేవారు 330 దిర్హామ్ల నుంచి ప్రారంభమయ్యే టిక్కెట్లను కొనుగోలు చేయొచ్చు. ఢిల్లీకి 385 దిర్హామ్లకే ప్రయాణం చేసే వీలుంది. అహ్మదాబాద్, నాగపూర్, గోవా, కొలంబో, బీరుట్, ఇస్తాంబుల్, కాట్మండు, అలెగ్జాండ్రియా, కాబూల్, కౌలాలంపూర్, అమ్మాన్, ట్యునిస్, క్వెట్టా తదితర నగరాలకు ఆఫర్ టిక్కెట్ ధరలు వర్తిస్తాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ