ఇండియాకి ఆఫర్ టిక్కెట్స్ ప్రకటించిన యూఏఈ ఎయిర్లైన్స్
- August 24, 2019ఈద్ అల్ అదా సెలవుల్లో సొంత ప్రాంతాలకు వెళ్ళలేకపోయినవారికి మరో అవకాశం కల్పిస్తోంది యూఏఈకి చెందిన ఎయిర్ లైన్స్. షార్జా కేంద్రంగా పనిచేస్తోన్న ఎయిర్ అరేబియా, వన్ వే డిస్కౌంట్ ఫేర్స్ని మొత్తం 16 సిటీస్కి వెళ్ళాలనుకునేవారి కోసం ప్రకటించింది. వీటిల్లో ఇండియా, పాకిస్తాన్కి చెందిన పలు నగరాలున్నాయి. నేటితో ప్రారంభమయ్యే ఈ ఆఫర్స్ డిసెంబర్ 9 వరకు కొనసాగుతాయి. ముంబైకి వెళ్ళాలనుకునేవారు 330 దిర్హామ్ల నుంచి ప్రారంభమయ్యే టిక్కెట్లను కొనుగోలు చేయొచ్చు. ఢిల్లీకి 385 దిర్హామ్లకే ప్రయాణం చేసే వీలుంది. అహ్మదాబాద్, నాగపూర్, గోవా, కొలంబో, బీరుట్, ఇస్తాంబుల్, కాట్మండు, అలెగ్జాండ్రియా, కాబూల్, కౌలాలంపూర్, అమ్మాన్, ట్యునిస్, క్వెట్టా తదితర నగరాలకు ఆఫర్ టిక్కెట్ ధరలు వర్తిస్తాయి.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..