చిరంజీవి కార్యాలయం వద్ద సైరా వంశీయులు ధర్నా

- September 14, 2019 , by Maagulf
చిరంజీవి కార్యాలయం వద్ద సైరా వంశీయులు ధర్నా

తమకు న్యాయం చేయాలంటూ ఉయ్యాలవాడ వంశీ యులు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చిరంజీవి కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.సైరా నరసింహారెడ్డి సినిమా తీసేందుకు కావలసిన పూర్తి సమాచారంతో పాటు ,సినిమా షూటింగ్ చేసుకునేందుకు అవసరమైన లొకేషన్ లతో పాటు, నరసింహారెడ్డి జీవిత చరిత్రను పూర్తిగా తమనుండి తెలుసుకొన్నారని అన్నారు. సినిమాకు కావాల్సిన పూర్తి సమాచారం తెలుసుకుని షూటింగ్ ను పూర్తి చేసుకొని ఇప్పుడు తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చిరంజీవి తమకు న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారని కానీ ప్రస్తుతం తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైరా వంశీయులు ధర్నా చేస్తున్నారనే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి వచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com