చాలా బాధాకరం: ఏపీలో బోటు ప్రమాదంపై రాహుల్ ట్వీట్
- September 15, 2019రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన అని, వారి కుటుంబానికి తన సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు రాహుల్ రాసుకొచ్చారు. ‘‘ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నదిలో బోటు మునిగిందనే వార్త విన్నాను. నిజంగా ఇది చాలా బాధాకరం. ఈ విషాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు నేను సంతాపం వ్యక్తం చేస్తున్నాను. అంతే కాకుండా గల్లంతైన వారు తొందర్లోనే సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో పర్యాటక బోటు(పున్నమి) మునిగిపోయింది. ఈ ప్రమాదం సమయంలో బోటులో 67 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గోదావరిలో వరద తగ్గడంతో అధికారులు బోటు పర్యటనకు అనుమతి ఇచ్చారు. దీంతో పున్నమి బోటు ప్రయాణికులతో పాపికొండలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్