మక్కాలో ఉమ్రా భద్రత పర్యవేక్షణకు 200 స్మార్ట్ స్క్రీన్లు ఏర్పాటు..!!
- March 17, 2025
మక్కా: మక్కాలోని కంట్రోల్ సెంటర్ రమదాన్ మాసంలో ఉమ్రా సీజన్లో భద్రతా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి 200 కంటే ఎక్కువ స్మార్ట్ వాల్ స్క్రీన్లను ఉపయోగిస్తోంది. ఈ కేంద్రం మక్కాలోని 11 ప్రధాన ద్వారాలు, ఎనిమిది కంటే ఎక్కువ భద్రతా తనిఖీ కేంద్రాల వద్ద భద్రతా చర్యలను పర్యవేక్షిస్తుంది. ఏడు భద్రతా అంచెలుగా భద్రతా కార్యకలాపాలను విభజించి పర్యవేక్షిస్తున్నారు.
దాంతోపాటు నిఘా కార్యకలాపాలు మక్కాలోని అన్ని జిల్లాలు, పొరుగు ప్రాంతాలను కవర్ చేస్తాయని, మసీదు ప్రాంగణంలో భద్రతా చర్యలను సమన్వయం చేసే గ్రాండ్ మసీదులోని ఆపరేషన్స్ గదికి ప్రత్యక్ష డేటా ప్రసారం ఉంటుందని అధికారులు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ కేంద్రం 24 గంటలూ పనిచేస్తుందన్నారు.సజావుగా కమ్యూనికేషన్, వేగవంతమైన ప్రతిస్పందన కోసం గ్రాండ్ మసీదులోని భద్రతా కార్యకలాపాల కేంద్రం, యూనిఫైడ్ ఆపరేషన్స్ సెంటర్ 911 తో నేరుగా అనుసంధానించబడి ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







