మక్కాలో ఉమ్రా భద్రత పర్యవేక్షణకు 200 స్మార్ట్ స్క్రీన్లు ఏర్పాటు..!!
- March 17, 2025
మక్కా: మక్కాలోని కంట్రోల్ సెంటర్ రమదాన్ మాసంలో ఉమ్రా సీజన్లో భద్రతా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి 200 కంటే ఎక్కువ స్మార్ట్ వాల్ స్క్రీన్లను ఉపయోగిస్తోంది. ఈ కేంద్రం మక్కాలోని 11 ప్రధాన ద్వారాలు, ఎనిమిది కంటే ఎక్కువ భద్రతా తనిఖీ కేంద్రాల వద్ద భద్రతా చర్యలను పర్యవేక్షిస్తుంది. ఏడు భద్రతా అంచెలుగా భద్రతా కార్యకలాపాలను విభజించి పర్యవేక్షిస్తున్నారు.
దాంతోపాటు నిఘా కార్యకలాపాలు మక్కాలోని అన్ని జిల్లాలు, పొరుగు ప్రాంతాలను కవర్ చేస్తాయని, మసీదు ప్రాంగణంలో భద్రతా చర్యలను సమన్వయం చేసే గ్రాండ్ మసీదులోని ఆపరేషన్స్ గదికి ప్రత్యక్ష డేటా ప్రసారం ఉంటుందని అధికారులు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ కేంద్రం 24 గంటలూ పనిచేస్తుందన్నారు.సజావుగా కమ్యూనికేషన్, వేగవంతమైన ప్రతిస్పందన కోసం గ్రాండ్ మసీదులోని భద్రతా కార్యకలాపాల కేంద్రం, యూనిఫైడ్ ఆపరేషన్స్ సెంటర్ 911 తో నేరుగా అనుసంధానించబడి ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







