ఏప్రిల్ నుండి వారాంతాల్లో, సెలవు దినాలలో పనిచేయనున్న బ్యాంక్ సెటిల్మెంట్ వ్యవస్థ..!!
- March 17, 2025
కువైట్: కువైట్ సెంట్రల్ బ్యాంక్..వారాంతాల్లో మరియు ఏప్రిల్ ప్రారంభం నుండి అధికారిక సెలవు దినాలలో ఆటోమేటెడ్ సెటిల్మెంట్ సిస్టమ్ ఫర్ ఇంటర్-పార్టిసిపెంట్ పేమెంట్స్ (KASSIP), కువైట్ ఎలక్ట్రానిక్ చెక్ క్లియరింగ్ సిస్టమ్ (KECCS) లను నిర్వహించాలని స్థానిక బ్యాంకులకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. బ్యాంకింగ్ రంగం ఆర్థిక సేవల నాణ్యత, స్థిరత్వాన్ని కొనసాగించడానికి, జాతీయ ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడానికి CBK ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
ఈ చర్య సమాజంలోని అన్ని వర్గాల అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటనలో తెలిపింది. KASSIP ఉదయం 7:00 నుండి రాత్రి 11:15 వరకు బ్యాంకు ఖాతాదారుల కోసం పనిచేస్తుంది ఇంటర్బ్యాంక్ KECCS 24 గంటలూ పనిచేస్తుంది. KECCS కింద చెక్కు క్లియరింగ్ కోసం చివరి దరఖాస్తును సాయంత్రం 7:00 గంటలకు ముందు సమర్పించాలి. దానికి ఒక గంటలోపు సమాధానం అందుతుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..









