చట్టవిరుద్ధంగా కార్మికుల నియామకం..ఇద్దరికి 600,000 దిర్హామ్ల జరిమానా..!!
- March 18, 2025
యూఏఈ: 12 మంది కార్మికులను చట్టవిరుద్ధంగా నియమించినందుకు ఇద్దరు వ్యక్తులకు 600,000 దిర్హామ్ల జరిమానా విధించింది యూఏఈ కోర్టు. ఫిబ్రవరిలో నిర్వహించిన తనిఖీలలో వీరిద్దరినీ అరెస్టు చేశారు. 12 మంది కార్మికులకు 1,000 దిర్హామ్ల జరిమానా విధించి దేశం నుండి బహిష్కరించారు. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) గత నెలలో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయడానికి 252 తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా 4,771 సంస్థలను తనిఖీ చేసినట్లు ఐసిపి డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సుహైల్ సయీద్ అల్ ఖైలి తెలిపారు. అరెస్టు చేసిన అక్రమ కార్మికులను చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు వెల్లడించారు. కోర్టు తీర్పుల ఆధారంగా.. ఉల్లంఘించినవారికి, వారిని నియమించిన వారికి జరిమానా విధించగా, కొంతమందిని బహిష్కరించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కొలంబియా భూకంప బాధితులకు యూఏఈ భారీ సాయం..!!
- ఖతార్లో వినియోగదారుల భద్రతకు పెద్దపీట..!!
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం







