చట్టవిరుద్ధంగా కార్మికుల నియామకం..ఇద్దరికి 600,000 దిర్హామ్ల జరిమానా..!!
- March 18, 2025
యూఏఈ: 12 మంది కార్మికులను చట్టవిరుద్ధంగా నియమించినందుకు ఇద్దరు వ్యక్తులకు 600,000 దిర్హామ్ల జరిమానా విధించింది యూఏఈ కోర్టు. ఫిబ్రవరిలో నిర్వహించిన తనిఖీలలో వీరిద్దరినీ అరెస్టు చేశారు. 12 మంది కార్మికులకు 1,000 దిర్హామ్ల జరిమానా విధించి దేశం నుండి బహిష్కరించారు. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) గత నెలలో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయడానికి 252 తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా 4,771 సంస్థలను తనిఖీ చేసినట్లు ఐసిపి డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సుహైల్ సయీద్ అల్ ఖైలి తెలిపారు. అరెస్టు చేసిన అక్రమ కార్మికులను చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు వెల్లడించారు. కోర్టు తీర్పుల ఆధారంగా.. ఉల్లంఘించినవారికి, వారిని నియమించిన వారికి జరిమానా విధించగా, కొంతమందిని బహిష్కరించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









