చట్టవిరుద్ధంగా కార్మికుల నియామకం..ఇద్దరికి 600,000 దిర్హామ్ల జరిమానా..!!
- March 18, 2025
యూఏఈ: 12 మంది కార్మికులను చట్టవిరుద్ధంగా నియమించినందుకు ఇద్దరు వ్యక్తులకు 600,000 దిర్హామ్ల జరిమానా విధించింది యూఏఈ కోర్టు. ఫిబ్రవరిలో నిర్వహించిన తనిఖీలలో వీరిద్దరినీ అరెస్టు చేశారు. 12 మంది కార్మికులకు 1,000 దిర్హామ్ల జరిమానా విధించి దేశం నుండి బహిష్కరించారు. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) గత నెలలో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయడానికి 252 తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా 4,771 సంస్థలను తనిఖీ చేసినట్లు ఐసిపి డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సుహైల్ సయీద్ అల్ ఖైలి తెలిపారు. అరెస్టు చేసిన అక్రమ కార్మికులను చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు వెల్లడించారు. కోర్టు తీర్పుల ఆధారంగా.. ఉల్లంఘించినవారికి, వారిని నియమించిన వారికి జరిమానా విధించగా, కొంతమందిని బహిష్కరించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







