చట్టవిరుద్ధంగా కార్మికుల నియామకం..ఇద్దరికి 600,000 దిర్హామ్ల జరిమానా..!!
- March 18, 2025
యూఏఈ: 12 మంది కార్మికులను చట్టవిరుద్ధంగా నియమించినందుకు ఇద్దరు వ్యక్తులకు 600,000 దిర్హామ్ల జరిమానా విధించింది యూఏఈ కోర్టు. ఫిబ్రవరిలో నిర్వహించిన తనిఖీలలో వీరిద్దరినీ అరెస్టు చేశారు. 12 మంది కార్మికులకు 1,000 దిర్హామ్ల జరిమానా విధించి దేశం నుండి బహిష్కరించారు. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) గత నెలలో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయడానికి 252 తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా 4,771 సంస్థలను తనిఖీ చేసినట్లు ఐసిపి డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సుహైల్ సయీద్ అల్ ఖైలి తెలిపారు. అరెస్టు చేసిన అక్రమ కార్మికులను చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు వెల్లడించారు. కోర్టు తీర్పుల ఆధారంగా.. ఉల్లంఘించినవారికి, వారిని నియమించిన వారికి జరిమానా విధించగా, కొంతమందిని బహిష్కరించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







