1,200కి పైగా ఆన్లైన్ ఫిషింగ్ కేసులు నమోదు..!!
- March 18, 2025
యూఏఈ: యూఏఈ వ్యాప్తంగా 1,200కి పైగా ఆన్లైన్ ఫిషింగ్ కేసులు నమోదయ్యాయని సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించింది. ఈ కేసులు మోసపూరిత ఆన్లైన్, సోషల్ మీడియా విరాళాల ప్రచారాల రూపంలో ఉన్నాయన్నారు. రమదాన్ నెలలో ఈ కేసుల్లో భారీగా పెరుగుదల ఉందని, దీని వలన ప్రజలు ఫిషింగ్ దాడులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ ఆన్లైన్ ప్రచారాలు దాతృత్వ పనుల పేరిట దోపిడీ చేస్తాయని, వారు జకాత్ విరాళాలను సేకరిస్తున్నట్లు పేర్కొంటాయని సూచిస్తున్నారు.
సైబర్ మోసగాళ్ళు నకిలీ ఖాతాల సృష్టించి.. భావోద్వేగపూరిత ఫోటోలు, వీడియోలు షేర్ చేసి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడి దోచుకుంటారని తెలిపారు.ఇందు కోసం వీరు నకిలీ వెబ్సైట్ల సృష్టితో సహా వివిధ పద్ధతులను ఉపయోగిస్తారని హెచ్చరించారు. అలాంటి వాటిని ట్రాక్ చేయడానికి అన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ అథారిటీ తెలిపింది.
ఏదైనా ఆన్లైన్ విరాళ అభ్యర్థనల ప్రామాణికతను ధృవీకరించుకోవాలని, విరాళాలు ఇవ్వబడిన సంస్థల విశ్వసనీయతను నిర్ధారించుకోవాలని సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ కమ్యూనిటీ సభ్యులను హెచ్చరించింది. సంబంధిత అధికారులచే ధృవీకరించబడిన అధీకృత సంస్థల ద్వారా మాత్రమే విరాళాలు ఇవ్వాలని సూచించారు. విశ్వసనీయత లేని సైట్లలో క్రెడిట్ కార్డ్ నంబర్లను ఆన్లైన్లో ఎవరితోనూ పంచుకోకూడదని అధికార యంత్రాంగం సూచించింది. నివాసితులు వెంటనే ఆన్లైన్ బెగ్గింగ్, ఫ్రాడ్ లాంటి ఏవైనా అనుమానాస్పద కేసులను సంబంధిత అధికారులకు నివేదించాలని కోరారు. ఇటీవల దుబాయ్ పోలీసులు రమదాన్ మొదటి 10 రోజుల్లో 33 మంది బెగ్గర్స్ ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా, షార్జాలో నగర పోలీసులు ఇటీవల నిర్వహించిన రియల్ టైమ్ ప్రయోగంలో ఒక వ్యక్తి బెగ్గర్ గా నటించి.. నివాసితుల భావోద్వేగాలను వాడుకొని కేవలం ఒక గంటలో Dh367 వసూలు చేయగలిగాడు. ఇది సోషల్ మీడియాలో వైరలవుతుంది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







