తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు ..
- March 21, 2025
తిరుమల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు (గురువారం) రాత్రి తిరుమల చేరుకున్నారు.తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలేశుని దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు
ముందుగా వారి కుటుంబ సభ్యులు తిరుమలకు చేరుకోగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయం నుంచి కారులో తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా చంద్రబాబుకు టీటీడీ ధర్మకర్తల మండలి, అధికారులు ఘన స్వాగతం పలికారు.
రాత్రి తిరుమలలోనే బస చేయనున్న చంద్రబాబు.. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలేశుని దర్శించుకోనున్నారు.మధ్యాహ్నం అన్నప్రసాద సముదాయంలో మనవడు దేవాన్ష్ పేరు మీద ఒక రోజు అన్నప్రసాదాన్ని పంపిణీ చేయడానికి రూ.44 లక్షలు టీటీడీకి విరాళంగా ఇవ్వనున్నారు.
తరువాత కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు అన్నప్రసాదం వడ్డించి..అక్కడే భోజనం చేస్తారు.ఆ తర్వాత కారులో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు.
తాజా వార్తలు
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం