అత్యవసరంగా ల్యాండైన సౌదీ వెళ్లాల్సిన విమానం..
- July 05, 2016
ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో సౌదీ అరేబియా వెళ్లాల్సిన విమానం అత్యవసరంగా ల్యాండైంది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఓ ప్రయాణికుడు విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత అస్వస్థతకు గురికావడంతో ఏటీసీ అనుమతితో వెంటనే విమానాన్ని ల్యాండింగ్ చేశారు. విమానాశ్రయంలోని అపోలో అస్పత్రిలో చికిత్స పొందిన ప్రయాణికుడు మంగళవారం సాయంత్ర డిశ్చార్జి అయినట్లు సమాచారం. ఆలస్యంగా బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆలస్యంగా బయలుదేరింది. మరమ్మతుల అనంతరం రాత్రి 8.30 గంటలకు విమానం ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









