NATS సంబరాల కోసం థమన్, దేవీశ్రీ
- March 24, 2025
హైదరాబాద్: అమెరికా లో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు ఈ సారి నాట్స్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. జూలై 4,5,6 తేదీల్లో టంపా వేదికగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో ఈ సారి ప్రముఖ సంగీత దర్శకులు థమన్తో పాటు దేవీశ్రీ కూడా రావడం సంబరాలకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఒక్క రోజు థమన్, మరో రోజు దేవిశ్రీ తమ మ్యూజిక్ షోలతో తెలుగువారిని అలరించనున్నారు. అమెరికా తెలుగు సంబరాలకు విచ్చేసే అతిధులతో నాట్స్ హైదరాబాద్లో నిర్వహించిన సెలబ్రీటీ మీట్ అండ్ గ్రీట్లో థమన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దేవీశ్రీతో పాటు తాను కూడా అమెరికా తెలుగు సంబరాల్లో పాల్గొంటున్నానని థమన్ తెలిపారు. మేమిద్దరి బ్యాక్ టూ బ్యాక్ షోలతో తెలుగు వారికి అంతులేని ఆనందాలను పంచేందుకు సిద్ధంగా ఉన్నామని థమన్ అన్నారు. నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని నాట్స్ సంబరాల కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ అన్నారు. నెవర్ బీఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అనే తరహాలో అమెరికా తెలుగు సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అమెరికాలో ఉండే తెలుగు వారు టంపాలో నిర్వహించే సంబరాల్లో పాలుపంచుకోవాలని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కోరారు. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే అమెరికా తెలుగు సంబరాలను నాట్స్ ప్రతిసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. సంబరాల్లో తెలుగు ఆట, పాటలతో పాటు ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు తెలుగువారిని అలరిస్తాయని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తెలిపారు.అమెరికా సంబరాలకు వచ్చే తెలుగువారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నామని నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







