కార్తీ కథానాయకుడిగా మణిరత్నం చిత్రo..
- July 05, 2016
ఎస్ డెరైక్టర్ మణిరత్నం తాజా చిత్రం ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. ఓ కాదల్ కణ్మణి వంటి విజయవంతమైన చిత్రం తరువాత మణిరత్నం కొన్ని ప్రాజెక్ట్లు అనుకున్నా అనివార్యకారణాల వల్ల అవి ఆచరణలోకి రాలేదు. దీంతో ఈ ప్రఖ్యాత దర్శకుడి చిత్రం ఇదిగో,అదిుగో ప్రారంభం అవుతోంది అంటూ ప్రచారాలకే పరిమితమైంది. ఇప్పటికీ ఆయన తాజా చిత్రం సెట్ అయ్యింది. కార్తీ కథానాయకుడిగా మణిరత్నం చిత్రాన్ని మొదలెడుతున్నారు. ఇందులో కార్తీకి జంటగా ముంబై బ్యూటీ అదితిరావును ఎంపిక చేశారు.అంతే కాదు ఈ చిత్రానికి కాట్రు వెలియిడై అనే టైటిల్ను కూడా మణిరత్నం ఫిక్స్ చేశారన్నది తాజా సమాచారం. ఇందులో కార్తీ విమాన పైలట్గా నటించనున్నట్లు తెలిసిందే. ఇందుకోసం ఆయన చాలా కసరత్తులు చేసి స్లిమ్గా తయారయ్యారట. ఈ చిత్ర షూటింగ్ 8వ తేదీ నుంచి ఊటీలో ప్రారంభం కానుంది. తొలుత పాటతో మొదలయ్యే ఈ కాట్రు వెలియిడై చిత్రం అక్కడ 40 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకోనున్నట్లు తెలిసింది. దీనికి మణిరత్నం ఆస్థాన సంగీతదర్శకుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని, రవివర్మ చాయాగ్రహణను, వైరముత్తు పాటలను అందిస్తున్నారు. మణిరత్నం తన మెడ్రాస్ టాకీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్ర విడుదల హక్కుల్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ పొందినట్లు, దీన్ని ఈ ఏడాది చివరిలో విడుదలకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు యూనిట్ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







