యాంకుల్‌లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!

- March 27, 2025 , by Maagulf
యాంకుల్‌లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!

మస్కట్: అల్ దహిరా గవర్నరేట్‌లోని యాంకుల్‌లోని విలాయత్‌లో వాడి బైహా డ్యామ్  నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ డ్యామును వ్యవసాయం, మత్స్య, జల వనరుల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో సుమారు OMR60,000 ఖర్చుతో నిర్మించారు. డ్యామ్ నిర్మాణ పర్యవేక్షకుడైన సలేం బిన్ హమీద్ అల్ బాడి మాట్లాడుతూ..ఆనకట్ట పొడవు 53 మీటర్లు, దాని ఎత్తు 11 మీటర్లు, దాని నిల్వ సామర్థ్యం దాదాపు 33,000 గాలన్లు అని చెప్పారు.

235 రోజులు పట్టిన నిర్మాణ ప్రక్రియలో రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ పదార్థాలు, రాళ్ళు, ఫిల్టర్లు, ఇతర పదార్థాలను ఉపయోగించారు. 

ఈ డ్యామ్ ఉన్న ప్రదేశం ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి అని, అది నీటితో నిండియన సమయలో సాహసికులు, ప్రకృతి ఔత్సాహికులకు ఇది పర్యాటక కేంద్రంగా మారుతుందని అల్ బాడి అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com