భారత జనాభా 127, 42, 39, 769

- July 12, 2015 , by Maagulf
భారత జనాభా 127, 42, 39, 769

శనివారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకు భారత జనాభా సంఖ్య 127, 42, 39, 769కి చేరింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జాతీయ జనాభా కమీషన్, అమెరికా గణాంకాల సంస్థల సంయుక్త సమాచారం ఆధారంగా ‘జాతీయ జనాభా స్థిరీకరణ నిధి’ ఈ వివరాలను వెల్లడించింది. ఏటా భారత్‌లో 16 శాతం వృద్ధి నమోదవుతున్న కారణంగా 2015 సంవత్సరానికి చైనాను వెనక్కినెట్టి జనాభా పరంగా తొలి స్థానంలో నిలుస్తుందని తెలిపింది. కాగా, ఇప్పటికి ప్రపంచ జనాభాలో 17.25 శాతం జనాభా భారత్‌లోనే నివసిస్తున్నారు. కాగా, ప్రపంచ జనాభా సంఖ్యలో ఐదో స్థానంలో ఉన్న బ్రెజిల్ కంటే మన దేశంలోని ఉత్తరప్రదేశ్ జనాభా సంఖ్యే ఎక్కువ కావడం విశేషం.

 

                          ఎం.వాసుదేవ రావు (మాగాల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com