'ఫక్ కుర్బా' చొరవతో వందలాది మందికి విముక్తి..!!
- March 28, 2025
మస్కట్: పవిత్ర రమదాన్ మాసానికి ముందు ప్రారంభించబడిన మానవతా చొరవ "ఫక్ కుర్బా" 12వ ఎడిషన్ ప్రారంభమైంది. దీనికింద ఇప్పటి వరకు 999 మందిని వారి రుణాల నుండి విముక్తి చేశారు.అప్పుల భారంతో బాధపడుతున్న వారికి సాంత్వన కుదిర్చింది. ఈ వ్యక్తుల విడుదల రెండు దశల్లో పూర్తయింది.మొదటి దశలో 511 కేసులను విడుదల చేశారు. తరువాత రెండవ దశలో 488 కేసులను విడుదల చేశారు.
ఒమానీ న్యాయవాదుల సంఘం చైర్మన్ డాక్టర్ హమద్ బిన్ హమ్దాన్ అల్-రుబై మాట్లాడుతూ.. నిర్వాహకులు మరింత మంది వ్యక్తులను రుణాల నుండి విడుదల చేయించడానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. వివిధ సంస్థలు, కంపెనీలు, వ్యక్తుల నుండి లభించిన గణనీయమైన మద్దతును ఆయన గుర్తించారు. ఈ విజయానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దోహదపడిన వారందరికీ డాక్టర్ అల్-రుబై తన కృతజ్ఞతలు తెలిపారు. 2012లో ప్రారంభమైన "ఫక్ కుర్బా" చొరవ కింద ఇప్పటివరకు 7,110 మందికి పైగా వ్యక్తులు విడుదలయ్యారని తెలిపారు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









