'ఫక్ కుర్బా' చొరవతో వందలాది మందికి విముక్తి..!!
- March 28, 2025
మస్కట్: పవిత్ర రమదాన్ మాసానికి ముందు ప్రారంభించబడిన మానవతా చొరవ "ఫక్ కుర్బా" 12వ ఎడిషన్ ప్రారంభమైంది. దీనికింద ఇప్పటి వరకు 999 మందిని వారి రుణాల నుండి విముక్తి చేశారు.అప్పుల భారంతో బాధపడుతున్న వారికి సాంత్వన కుదిర్చింది. ఈ వ్యక్తుల విడుదల రెండు దశల్లో పూర్తయింది.మొదటి దశలో 511 కేసులను విడుదల చేశారు. తరువాత రెండవ దశలో 488 కేసులను విడుదల చేశారు.
ఒమానీ న్యాయవాదుల సంఘం చైర్మన్ డాక్టర్ హమద్ బిన్ హమ్దాన్ అల్-రుబై మాట్లాడుతూ.. నిర్వాహకులు మరింత మంది వ్యక్తులను రుణాల నుండి విడుదల చేయించడానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. వివిధ సంస్థలు, కంపెనీలు, వ్యక్తుల నుండి లభించిన గణనీయమైన మద్దతును ఆయన గుర్తించారు. ఈ విజయానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దోహదపడిన వారందరికీ డాక్టర్ అల్-రుబై తన కృతజ్ఞతలు తెలిపారు. 2012లో ప్రారంభమైన "ఫక్ కుర్బా" చొరవ కింద ఇప్పటివరకు 7,110 మందికి పైగా వ్యక్తులు విడుదలయ్యారని తెలిపారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్







