'ఫక్ కుర్బా' చొరవతో వందలాది మందికి విముక్తి..!!
- March 28, 2025
మస్కట్: పవిత్ర రమదాన్ మాసానికి ముందు ప్రారంభించబడిన మానవతా చొరవ "ఫక్ కుర్బా" 12వ ఎడిషన్ ప్రారంభమైంది. దీనికింద ఇప్పటి వరకు 999 మందిని వారి రుణాల నుండి విముక్తి చేశారు.అప్పుల భారంతో బాధపడుతున్న వారికి సాంత్వన కుదిర్చింది. ఈ వ్యక్తుల విడుదల రెండు దశల్లో పూర్తయింది.మొదటి దశలో 511 కేసులను విడుదల చేశారు. తరువాత రెండవ దశలో 488 కేసులను విడుదల చేశారు.
ఒమానీ న్యాయవాదుల సంఘం చైర్మన్ డాక్టర్ హమద్ బిన్ హమ్దాన్ అల్-రుబై మాట్లాడుతూ.. నిర్వాహకులు మరింత మంది వ్యక్తులను రుణాల నుండి విడుదల చేయించడానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. వివిధ సంస్థలు, కంపెనీలు, వ్యక్తుల నుండి లభించిన గణనీయమైన మద్దతును ఆయన గుర్తించారు. ఈ విజయానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దోహదపడిన వారందరికీ డాక్టర్ అల్-రుబై తన కృతజ్ఞతలు తెలిపారు. 2012లో ప్రారంభమైన "ఫక్ కుర్బా" చొరవ కింద ఇప్పటివరకు 7,110 మందికి పైగా వ్యక్తులు విడుదలయ్యారని తెలిపారు.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







