BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- October 12, 2025
మనామా: విలువ ఆధారిత పన్ను (VAT) చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన ఒక వ్యాపార సంస్థ యజమానిపై విచారణ పూర్తియింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ లోని ఆర్థిక నేరాలు మరియు మనీ లాండరింగ్ విభాగం వ్యాట్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు అతడిపై కేసు నమోదు చేసింది. అతని వాణిజ్య సంస్థకు చెందిన ఆర్థిక లావాదేవీలపై నేషనల్ బ్యూరో ఫర్ రెవెన్యూ (NBR) నుండి నివేదిక అందడంతో దర్యాప్తు జరిపినట్లు అధికారులు తెలిపారు.
సదరు వ్యాపారి BHD 52,000 కంటే ఎక్కువ వ్యాట్ ను కస్టమర్ల నుండి వసూలు చేశాడు. కానీ తప్పుడు పన్ను రిటర్న్లను సమర్పించి, NBRకి నిధులను చెల్లించకుండా ఫ్రాడ్ కు పాల్పడ్డాడు.
విచారణ సమయంలో కంపెనీ యజమాని ఆరోపణలను అంగీకరించాడు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అనుమానితుడిని మరియు అతని కంపెనీని మొదటి హై క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 21న విచారించనున్నట్టు ప్రకటించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







