BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- October 12, 2025
మనామా: విలువ ఆధారిత పన్ను (VAT) చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన ఒక వ్యాపార సంస్థ యజమానిపై విచారణ పూర్తియింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ లోని ఆర్థిక నేరాలు మరియు మనీ లాండరింగ్ విభాగం వ్యాట్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు అతడిపై కేసు నమోదు చేసింది. అతని వాణిజ్య సంస్థకు చెందిన ఆర్థిక లావాదేవీలపై నేషనల్ బ్యూరో ఫర్ రెవెన్యూ (NBR) నుండి నివేదిక అందడంతో దర్యాప్తు జరిపినట్లు అధికారులు తెలిపారు.
సదరు వ్యాపారి BHD 52,000 కంటే ఎక్కువ వ్యాట్ ను కస్టమర్ల నుండి వసూలు చేశాడు. కానీ తప్పుడు పన్ను రిటర్న్లను సమర్పించి, NBRకి నిధులను చెల్లించకుండా ఫ్రాడ్ కు పాల్పడ్డాడు.
విచారణ సమయంలో కంపెనీ యజమాని ఆరోపణలను అంగీకరించాడు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అనుమానితుడిని మరియు అతని కంపెనీని మొదటి హై క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 21న విచారించనున్నట్టు ప్రకటించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







