హైకోర్టు లాయర్ల సంఘం అధ్యక్షుడిగా చిదంబరం
- March 28, 2025
అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం (APHCAA) ఎన్నికల్లో అధ్యక్షులుగా సీనియర్ లాయర్ కలిగినీడి చిదంబరం వరుసగా రెండోసారి గెలుపొందారు. తన సమీప అభ్యర్థి జివిఎస్ కిషోర్ కుమార్ పై 328 ఓట్ల తేడాతో గెలిచారు.చిదంబరానికి 937 ఓట్లు రాగా, కిషోర్కు 609 ఓట్లు వచ్చాయి.ఈ ఎన్నికల్లో 3389 ఓట్లకు గాను 1744 ఓట్లు పోలయ్యాయి.ఉపాధ్యక్షులుగా కెవి రఘువీర్ విజయం సాధించారు.సమీప అభ్యర్థి తోట సునీతపై 248 ఓట్ల తేడాతో గెలుపొందారు.ప్రధాన కార్యదర్శిగా చేజర్ల సుబోధ్ తన సమీప అభ్యర్థి వెంకటేశ్వరరావుపై 529 ఓట్లతో గెలుపొందారు. సంయుక్త కార్యదర్శిగా పితాని చంద్రశేఖరరెడ్డి, గ్రంథాలయ కార్యదర్శిగా జంపని శ్రీదేవి, కోశాధికారిగా యద్దల దుర్గారావు, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా తోట తేజేశ్వరరావు (ఏకగ్రీవం), మహిళా ప్రతినిధిగా కంచర్ల ప్రసన్న, ఇసి సభ్యులుగా (30 సంవత్సరాలు) ఎవివిఎస్ఎన్ మూర్తి (ఏకగ్రీవం), ఇసి సభ్యులుగా (20 సంవత్సరాలు) సత్యానందరావు కోనే (ఏకగ్రీవం), మహిళా ఇసి సభ్యురాలిగా మంచాల ఉమాదేవి, ఇసి సభ్యులుగా గోడవర్తి కిరణ్బాబు, నల్లమూరు స్వర్ణలత, దీరధ రెడ్డి కారుమంచి, వివికె చక్రవర్తి ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









