హైకోర్టు లాయర్ల సంఘం అధ్యక్షుడిగా చిదంబరం
- March 28, 2025
అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం (APHCAA) ఎన్నికల్లో అధ్యక్షులుగా సీనియర్ లాయర్ కలిగినీడి చిదంబరం వరుసగా రెండోసారి గెలుపొందారు. తన సమీప అభ్యర్థి జివిఎస్ కిషోర్ కుమార్ పై 328 ఓట్ల తేడాతో గెలిచారు.చిదంబరానికి 937 ఓట్లు రాగా, కిషోర్కు 609 ఓట్లు వచ్చాయి.ఈ ఎన్నికల్లో 3389 ఓట్లకు గాను 1744 ఓట్లు పోలయ్యాయి.ఉపాధ్యక్షులుగా కెవి రఘువీర్ విజయం సాధించారు.సమీప అభ్యర్థి తోట సునీతపై 248 ఓట్ల తేడాతో గెలుపొందారు.ప్రధాన కార్యదర్శిగా చేజర్ల సుబోధ్ తన సమీప అభ్యర్థి వెంకటేశ్వరరావుపై 529 ఓట్లతో గెలుపొందారు. సంయుక్త కార్యదర్శిగా పితాని చంద్రశేఖరరెడ్డి, గ్రంథాలయ కార్యదర్శిగా జంపని శ్రీదేవి, కోశాధికారిగా యద్దల దుర్గారావు, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా తోట తేజేశ్వరరావు (ఏకగ్రీవం), మహిళా ప్రతినిధిగా కంచర్ల ప్రసన్న, ఇసి సభ్యులుగా (30 సంవత్సరాలు) ఎవివిఎస్ఎన్ మూర్తి (ఏకగ్రీవం), ఇసి సభ్యులుగా (20 సంవత్సరాలు) సత్యానందరావు కోనే (ఏకగ్రీవం), మహిళా ఇసి సభ్యురాలిగా మంచాల ఉమాదేవి, ఇసి సభ్యులుగా గోడవర్తి కిరణ్బాబు, నల్లమూరు స్వర్ణలత, దీరధ రెడ్డి కారుమంచి, వివికె చక్రవర్తి ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్