అద్దె వివాదాల్లో చిక్కుకున్న 86 మంది ఖైదీల విడుదల..!!
- March 28, 2025
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ కు ముందు, అద్దె సంబంధిత క్లెయిమ్లపై నిర్బంధించబడిన మొత్తం 86 మంది ఖైదీలను దుబాయ్లో విడుదల చేశారు. దుబాయ్ అద్దె వివాదాల కేంద్రం, మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ హ్యుమానిటేరియన్ & ఛారిటీ ఎస్ట్ మద్దతుతో మొత్తం Dh6.8 మిలియన్లకు పైగా ఉన్న బకాయి ఆర్థిక క్లెయిమ్లను పరిష్కరించడంతో ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు.
దుబాయ్ అద్దె వివాదాల కేంద్రం ఛైర్మన్ జడ్జి అబ్దుల్ ఖాదర్ మౌసా మొహమ్మద్ మాట్లాడుతూ.. ఈ చొరవ చట్టం-మానవత్వం రెండింటి స్ఫూర్తికి అనుగుణంగా వెనుకబడిన వారికి మద్దతు అందించడానికి నిర్దేశిందని తెలిపారు. అన్ని పార్టీల హక్కులను నిర్ధారిస్తూనే, సామాజిక న్యాయాన్ని పెంపొందించడానికి సంస్థలతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు.
గత నెలలో రమదాన్ పండుగకు ముందు, యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి , దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. దుబాయ్లోని వివిధ దేశాలకు చెందిన 1,518 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







