అద్దె వివాదాల్లో చిక్కుకున్న 86 మంది ఖైదీల విడుదల..!!
- March 28, 2025
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ కు ముందు, అద్దె సంబంధిత క్లెయిమ్లపై నిర్బంధించబడిన మొత్తం 86 మంది ఖైదీలను దుబాయ్లో విడుదల చేశారు. దుబాయ్ అద్దె వివాదాల కేంద్రం, మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ హ్యుమానిటేరియన్ & ఛారిటీ ఎస్ట్ మద్దతుతో మొత్తం Dh6.8 మిలియన్లకు పైగా ఉన్న బకాయి ఆర్థిక క్లెయిమ్లను పరిష్కరించడంతో ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు.
దుబాయ్ అద్దె వివాదాల కేంద్రం ఛైర్మన్ జడ్జి అబ్దుల్ ఖాదర్ మౌసా మొహమ్మద్ మాట్లాడుతూ.. ఈ చొరవ చట్టం-మానవత్వం రెండింటి స్ఫూర్తికి అనుగుణంగా వెనుకబడిన వారికి మద్దతు అందించడానికి నిర్దేశిందని తెలిపారు. అన్ని పార్టీల హక్కులను నిర్ధారిస్తూనే, సామాజిక న్యాయాన్ని పెంపొందించడానికి సంస్థలతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు.
గత నెలలో రమదాన్ పండుగకు ముందు, యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి , దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. దుబాయ్లోని వివిధ దేశాలకు చెందిన 1,518 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









