అద్దె వివాదాల్లో చిక్కుకున్న 86 మంది ఖైదీల విడుదల..!!
- March 28, 2025
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ కు ముందు, అద్దె సంబంధిత క్లెయిమ్లపై నిర్బంధించబడిన మొత్తం 86 మంది ఖైదీలను దుబాయ్లో విడుదల చేశారు. దుబాయ్ అద్దె వివాదాల కేంద్రం, మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ హ్యుమానిటేరియన్ & ఛారిటీ ఎస్ట్ మద్దతుతో మొత్తం Dh6.8 మిలియన్లకు పైగా ఉన్న బకాయి ఆర్థిక క్లెయిమ్లను పరిష్కరించడంతో ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు.
దుబాయ్ అద్దె వివాదాల కేంద్రం ఛైర్మన్ జడ్జి అబ్దుల్ ఖాదర్ మౌసా మొహమ్మద్ మాట్లాడుతూ.. ఈ చొరవ చట్టం-మానవత్వం రెండింటి స్ఫూర్తికి అనుగుణంగా వెనుకబడిన వారికి మద్దతు అందించడానికి నిర్దేశిందని తెలిపారు. అన్ని పార్టీల హక్కులను నిర్ధారిస్తూనే, సామాజిక న్యాయాన్ని పెంపొందించడానికి సంస్థలతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు.
గత నెలలో రమదాన్ పండుగకు ముందు, యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి , దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. దుబాయ్లోని వివిధ దేశాలకు చెందిన 1,518 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







