అద్దె వివాదాల్లో చిక్కుకున్న 86 మంది ఖైదీల విడుదల..!!
- March 28, 2025
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ కు ముందు, అద్దె సంబంధిత క్లెయిమ్లపై నిర్బంధించబడిన మొత్తం 86 మంది ఖైదీలను దుబాయ్లో విడుదల చేశారు. దుబాయ్ అద్దె వివాదాల కేంద్రం, మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ హ్యుమానిటేరియన్ & ఛారిటీ ఎస్ట్ మద్దతుతో మొత్తం Dh6.8 మిలియన్లకు పైగా ఉన్న బకాయి ఆర్థిక క్లెయిమ్లను పరిష్కరించడంతో ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు.
దుబాయ్ అద్దె వివాదాల కేంద్రం ఛైర్మన్ జడ్జి అబ్దుల్ ఖాదర్ మౌసా మొహమ్మద్ మాట్లాడుతూ.. ఈ చొరవ చట్టం-మానవత్వం రెండింటి స్ఫూర్తికి అనుగుణంగా వెనుకబడిన వారికి మద్దతు అందించడానికి నిర్దేశిందని తెలిపారు. అన్ని పార్టీల హక్కులను నిర్ధారిస్తూనే, సామాజిక న్యాయాన్ని పెంపొందించడానికి సంస్థలతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు.
గత నెలలో రమదాన్ పండుగకు ముందు, యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి , దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. దుబాయ్లోని వివిధ దేశాలకు చెందిన 1,518 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







