ఉమ్ అల్ క్వైన్ రూలర్ మధర్ కన్నుమూత..3 రోజులు సంతాప దినాలు..!!

- March 31, 2025 , by Maagulf
ఉమ్ అల్ క్వైన్ రూలర్ మధర్ కన్నుమూత..3 రోజులు సంతాప దినాలు..!!

యూఏఈ: సుప్రీం కౌన్సిల్ సభ్యుడు,  ఉమ్ అల్ క్వైన్ పాలకుడు షేక్ సౌద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.ఆయన తల్లి షేఖా హెస్సా బింట్ హుమైద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ షంసీ కన్నూమూశారు.ఆమె మృతి నేపథ్యంలో అడ్మిన్ ఆఫీస్ నేటి నుండి మూడు రోజులపాటు అధికారిక సంతాప దినాలు ప్రకటించింది. జెండాలను అవనతం చేసింది. ఉమ్ అల్ క్వైన్‌లోని అల్ రాస్ ప్రాంతంలోని షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా మసీదులో మధ్యాహ్నం ప్రార్థన తర్వాత అంత్యక్రియల ప్రార్థన జరుగుతుంది.  


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com