రమదాన్ మాసంలో హరమైన్ హై-స్పీడ్ రైల్వే కొత్త రికార్డులు..!!
- April 01, 2025
జెడ్డా: పవిత్ర రమదాన్ మాసంలో హరమైన్ హై-స్పీడ్ రైల్వే 1.2 మిలియన్లకు పైగా ప్రయాణికులకు సేవలు అందించింది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 21% పెరుగుదల అని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) యాక్టింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రుమైహ్ అల్-రుమైహ్ ప్రకటించారు. రైల్వేలు, పబ్లిక్ బస్సులు, రైడ్-హెయిలింగ్ సేవలు, డెలివరీ యాప్లు, పోస్టల్ లాజిస్టిక్స్తో సహా పలు రంగాలలో అధిక పనితీరును కనబరిచాయని డాక్టర్ అల్-రుమైహ్ తెలిపారు. "రమదాన్ సందర్భంగా డిమాండ్ కు అనుగుణంగా సమగ్ర రవాణా సేవలను అందించాము. కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రతిబింబించే రికార్డు గణాంకాలను సాధించాము" అని ఆయన అన్నారు. రమదాన్ సందర్భంగా ప్రభుత్వ రవాణా బస్సులు నగరాల్లో 10 మిలియన్లకు పైగా ప్రయాణికులకు సేవలు అందించాయన్నారు. ఇందులో మక్కా, మదీనా మొత్తం 34% వాటాను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగ భాగస్వాముల పాత్రను కూడా ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









