రమదాన్ మాసంలో హరమైన్ హై-స్పీడ్ రైల్వే కొత్త రికార్డులు..!!
- April 01, 2025
జెడ్డా: పవిత్ర రమదాన్ మాసంలో హరమైన్ హై-స్పీడ్ రైల్వే 1.2 మిలియన్లకు పైగా ప్రయాణికులకు సేవలు అందించింది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 21% పెరుగుదల అని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) యాక్టింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రుమైహ్ అల్-రుమైహ్ ప్రకటించారు. రైల్వేలు, పబ్లిక్ బస్సులు, రైడ్-హెయిలింగ్ సేవలు, డెలివరీ యాప్లు, పోస్టల్ లాజిస్టిక్స్తో సహా పలు రంగాలలో అధిక పనితీరును కనబరిచాయని డాక్టర్ అల్-రుమైహ్ తెలిపారు. "రమదాన్ సందర్భంగా డిమాండ్ కు అనుగుణంగా సమగ్ర రవాణా సేవలను అందించాము. కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రతిబింబించే రికార్డు గణాంకాలను సాధించాము" అని ఆయన అన్నారు. రమదాన్ సందర్భంగా ప్రభుత్వ రవాణా బస్సులు నగరాల్లో 10 మిలియన్లకు పైగా ప్రయాణికులకు సేవలు అందించాయన్నారు. ఇందులో మక్కా, మదీనా మొత్తం 34% వాటాను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగ భాగస్వాముల పాత్రను కూడా ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







