రమదాన్ మాసంలో హరమైన్ హై-స్పీడ్ రైల్వే కొత్త రికార్డులు..!!
- April 01, 2025
జెడ్డా: పవిత్ర రమదాన్ మాసంలో హరమైన్ హై-స్పీడ్ రైల్వే 1.2 మిలియన్లకు పైగా ప్రయాణికులకు సేవలు అందించింది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 21% పెరుగుదల అని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) యాక్టింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రుమైహ్ అల్-రుమైహ్ ప్రకటించారు. రైల్వేలు, పబ్లిక్ బస్సులు, రైడ్-హెయిలింగ్ సేవలు, డెలివరీ యాప్లు, పోస్టల్ లాజిస్టిక్స్తో సహా పలు రంగాలలో అధిక పనితీరును కనబరిచాయని డాక్టర్ అల్-రుమైహ్ తెలిపారు. "రమదాన్ సందర్భంగా డిమాండ్ కు అనుగుణంగా సమగ్ర రవాణా సేవలను అందించాము. కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రతిబింబించే రికార్డు గణాంకాలను సాధించాము" అని ఆయన అన్నారు. రమదాన్ సందర్భంగా ప్రభుత్వ రవాణా బస్సులు నగరాల్లో 10 మిలియన్లకు పైగా ప్రయాణికులకు సేవలు అందించాయన్నారు. ఇందులో మక్కా, మదీనా మొత్తం 34% వాటాను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగ భాగస్వాముల పాత్రను కూడా ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!







