మే నెలలో యూఏఈకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..!!
- April 01, 2025
యూఏఈ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విదేశీ పర్యటనలో భాగంగామే నెలలో యూఏఈలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు పెట్టుబడి ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని సమాచారం. అదే క్రమంలో ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా పర్యటించనున్నారు. ఈ మేరకు "ఇది వచ్చే నెల కావచ్చు, బహుశా కొంచెం ఆలస్యం కావచ్చు" అని ట్రంప్ ఓవల్ కార్యాలయంలో విలేకరులతో అన్నారు.
ట్రంప్ 2017లో తన తొలి పదవీకాలంలో తన తొలి విదేశీ పర్యటనలో సౌదీ అరేబియా, ఇజ్రాయెల్లలో పర్యటించారు. సౌదీ అరేబియా పర్యటనలో సైనిక పరికరాల కొనుగోళ్లు సహా అమెరికా ఆర్థిక వ్యవస్థలో 1 ట్రిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని ట్రంప్ మార్చి నెల మొదట్లో విలేకరులతో అన్నారు. ఖతార్, యూఏఈలో ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటామని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









