మే నెలలో యూఏఈకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..!!
- April 01, 2025
యూఏఈ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విదేశీ పర్యటనలో భాగంగామే నెలలో యూఏఈలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు పెట్టుబడి ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని సమాచారం. అదే క్రమంలో ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా పర్యటించనున్నారు. ఈ మేరకు "ఇది వచ్చే నెల కావచ్చు, బహుశా కొంచెం ఆలస్యం కావచ్చు" అని ట్రంప్ ఓవల్ కార్యాలయంలో విలేకరులతో అన్నారు.
ట్రంప్ 2017లో తన తొలి పదవీకాలంలో తన తొలి విదేశీ పర్యటనలో సౌదీ అరేబియా, ఇజ్రాయెల్లలో పర్యటించారు. సౌదీ అరేబియా పర్యటనలో సైనిక పరికరాల కొనుగోళ్లు సహా అమెరికా ఆర్థిక వ్యవస్థలో 1 ట్రిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని ట్రంప్ మార్చి నెల మొదట్లో విలేకరులతో అన్నారు. ఖతార్, యూఏఈలో ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటామని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







