ఖతార్ లో పిల్లల భద్రతపై ఆందోళన..పేరెంట్స్ కు హెచ్చరికలు..!!
- April 01, 2025
దోహా: ఖతార్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రమాదాలను నివారించడానికి, భద్రతను నిర్ధారించడానికి తల్లిదండ్రులు ముఖ్యంగా బీచ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఇతర బహిరంగ ప్రదేశాలలో తమ పిల్లలను నిశితంగా పర్యవేక్షించాలని కోరుతున్నారు. వాతావరణం మెరుగుపడటంతో కుటుంబాలు వాటర్ సంబంధిత కార్యకలాపాలలో ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపుతున్నారు.
హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC)లోని పీడియాట్రిక్ విభాగాల ఛైర్మన్, పీడియాట్రిక్ ఎమర్జెన్సీ సెంటర్ (PEC) డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ అలమ్రీ మాట్లాడుతూ.. పిల్లలపై నిరంతర పర్యవేక్షణ అవసరాన్ని వివరించారు. “ఎక్కువ కుటుంబాలు బీచ్లు, స్మిమ్మింగ్ పూల్స్ కు వెళ్లడం, వాటర్ కార్యకలాపాలలో పాల్గొనడంతో, తల్లిదండ్రులు పిల్లలను నిశితంగా గమనించడం చాలా ముఖ్యం” అని డాక్టర్ అలమ్రీ సూచించారు. తల్లిదండ్రులు పిల్లలకు లైఫ్ జాకెట్లు సహా సరైన ఈత సామగ్రిని కలిగి ఉండేలా చూసుకోవాలని, సమీపంలోని లైఫ్గార్డ్ స్టేషన్లు లేదా పబ్లిక్ పూల్స్, బీచ్ల వద్ద భద్రతా సేవల గురించి తెలుసుకోవాలని ఆయన సూచించారు.
14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సంబంధించిన వైద్య అత్యవసర పరిస్థితుల కోసం దేశవ్యాప్తంగా PECలు 24x7 తెరిచి ఉంటాయని తెలిపారు. డాక్టర్ అలమ్రీ PRCల ప్రకారం.. ఈద్ అల్ ఫితర్ మొదటి రోజున మునుపటి వారంతో పోలిస్తే తక్కువ కేసులు నమోదయ్యాయి. ఈద్ మొదటి రోజున వచ్చిన కేసుల సంఖ్య మునుపటి వారంతో పోలిస్తే 30% తక్కువగా ఉందని ఆయన అన్నారు.
అల్ సద్లోని ప్రధాన PECలో 698 కేసులు, అల్ రయ్యన్లోని PECలో 370 కేసులు, విమానాశ్రయంలోని PECలో 122 కేసులు, అల్ వక్రాలోని PECలో 230 కేసులు, ఐషా బింట్ హమద్ అల్ అత్తియా ఆసుపత్రిలోని PECలో 64 కేసులు, అల్ ఖోర్లోని PECలో 61 కేసులు నమోదయ్యాయి. HMC విడుదల చేసిన డేటా ప్రకారం.. ఫిబ్రవరి 2025లో PECలలో 72,742 మంది పిల్లలకు చికిత్స అందించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









